సీనియర్ పొలిటిషన్ వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందెం సొంత పార్టీ , ప్రభుత్వం పైన ఆనం రామనారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.అసలు తాను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానా అని బాధపడుతున్నానని, ఈ ప్రభుత్వంలో ఏ చిన్న పని కావడం లేదని , కనీసం రోడ్లు కూడా వేయించలేకపోతున్నాను అంటూ ఆనం ఆవేదన వ్యక్తం చేస్తూ బహిరంగంగా ప్రభుత్వం తీరుపై విమర్శలు చేయడంతో, వైసిపి అధిష్టానం సీరియస్ అయ్యింది.
ఆనం రామనారాయణ రెడ్డి ని పూర్తిగా పక్కన పెట్టింది.వెంకటగిరి నియోజకవర్గం వైసిపి ఇన్చార్జిగా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంటనే నియమించింది.
దీంతో ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి.ఆయన రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని వైసీపీ అనుమానిస్తోంది.
ఈ వ్యవహారం ఇలా ఉంటే తాజాగా రాం నారాయణ రెడ్డి నియోజకవర్గంలోని సైదాపురం మండలానికి చెందిన వైసిపి కీలక నాయకులు, తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది .
ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నేదురుమిల్లి రాం కుమార్ రెడ్డిని నియమించడంతో , ఆనం ప్రభుత్వం పై విమర్శలు చేయడం బాగా తగ్గించారు.అయితే ఇప్పుడు పార్టీ క్యాడర్ తో ఆయన ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడంతో, ఆనం ఏ అంశాల గురించి వారితో చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఆనం నిర్వహించబోయే సమావేశానికి పార్టీ తరఫున ఎవరు హాజరు కావద్దని పరోక్షంగా కొంతమంది నేతలకు ఆదేశాలు వెళ్లాయట.ఆనం సభకు ఎవరు వెళ్ళకుండా నేదుతుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వర్గం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో, ఈరోజు జరగబోయే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.బహుశా ఆయన టిడిపిలోకి వెళ్లే విషయంపైనే పార్టీ క్యాడర్ తో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.