ఇండియాలో భక్తిని అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువ అంటున్న కంగనా

ఇతర దేశాలలో జాతి మనుషుల మధ్య ఆధిపత్యానికి కారణం అయితే ఇండియాలో మాత్రం మతం, కులం, ప్రాంతం మనుషుల మధ్య సంబంధాలని దెబ్బ తీస్తూ ఒకరిని ఒకరు లక్ష్యంగా చేసుకొని భౌతిక, మానసిక దాడులు చేసుకునే స్థాయిలో పరిస్థితి ఉంటుంది.భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే మన దేశంలో కొంత మంది కుహన మేధావులు, లౌకికవాదుల ముసుగులో కొంత మంది అరాచక వాదులు మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉంటారు.

 Kangna Ranaut Comments On Lord Ram Worship, Bollywood, Hinduism, Secularism, Lor-TeluguStop.com

వారి రాజకీయ భవిష్యత్తు కోసం మతాలని విడగొట్టి, మనుషులని రెచ్చగొట్టి విధ్వంసాలకు కారణం అవుతారు.ముఖ్యంగా హిందూ మతంపై మొదటి నుంచి ఇండియాలో కొన్ని శక్తులు నిత్యం ఏదో ఒకరూపంలో దాడి చేస్తూనే ఉంటాయి.

హిందుత్వ ముసుగు వేసుకొని కొంత మంది చేస్తే, అలాంటి అరాచక వాదులని చూపిస్తూ మొత్తం హిందూ సమాజం మీద బురద జల్లుతూ హిందూ దేవతలని కించపరుస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

తాజాగా వివాదాస్పద నటి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇదే విషయంలో సంచలన వాఖ్యలు చేశారు.

హాలీవుడ్ నటి సల్మాహయెక్ తాను హిందూ దేవత లక్ష్మీదేవిని ధ్యానిస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపింది.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మతం, జాతి అనే తేడా లేకుండా చాలా మంది రాముడిని ప్రేమిస్తారని తెలిపింది.ఎంతోమంది భగవద్గీతను అనుసరిస్తారని చెప్పారు.

కానీ మన దేశంలో మాత్రం కొంత మంది భక్తిని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది.ఇక్కడ మనం భక్తిని ఎంచుకోవడం లేదని, భక్తే మనల్ని ఎంచుకుంటోందని చెప్పింది.

ఈమె వాఖ్యలు కాస్తా హిందువుల మనోభావాల్ని సంతృప్తి పరిచే విధంగా, బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండటంతో బీజేపీ వ్యతిరేకులు ఇప్పుడు కంగనాని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube