ఆసుపత్రి ముందు గుర్తు తెలియని వ్యక్తి మృతి

మానవత్వం మంటగలిసింది.కరోనా కారణంగా బంధాలు, బంధుత్వాలు మరిచారు.

 Nizamabad, Hospital, Man, Die-TeluguStop.com

ఎక్కడ ఎవరికి కరోనా ఉందేమో అనే భయంతో కొందరు బంధాలను తెంచుకుంటున్నారు.కరోనా కారణంగా కొందరు తమ సొంత కుటుంబ వ్యక్తులనే ఇంటి నుంచి వెలేసిన దాఖలు చాలా ఉన్నాయి.

సాధారణ మరణం సంభవించినా ‘‘ అతడు కరోనా వల్లే చనిపోయాడు.చనిపోయి ఉంటాడు’’ అనే పుకార్లు పుట్టి పట్టించుకోని ఘటనలు ఉన్నాయి.

తాజాగా ఈ కోవకే చెందిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది.

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గుర్తు తెలియని వ్యక్తి వర్షంలో తడిచి మృతి చెందాడు.

ఆదివారం సాయంత్రం ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద ఓ వ్యక్తి(45) స్పృహ తప్పి పడిపోయాడు.రోడ్డుపై ప్రజలు తిరుగుతున్న కరోనా ఉందనే భయంతో ఎవరు పట్టించుకోలేదు.పక్కనే ఆస్పత్రి ఉన్న సెక్యూరిటీ గార్డు, హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోలేదు.స్పృహ తప్పి పడిపోయిన కొద్ది సేపు తర్వాత భారీ వర్షం కురిసింది.

దీంతో ఆ బాధితులు గిలగిల కొట్టుకుంటు అక్కడే మృతి చెందాడు.సుమారు నాలుగు గంటల పాటు ఆస్పత్రి గేటు ముందు పడి ఉన్నాడు.అనంతరం కొందరు వ్యక్తులు ఆస్పత్రికి సిబ్బందికి తెలియజేయడంతో శవాన్ని మార్చరీకి తరలించారు.స్పృహ కోల్పోయి పడిపోయినప్పుడు ఎవరైనా స్పందించి సిబ్బందికి తెలిపినా అతడిని కాపాడి ఉండే వాళ్లమని ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube