శ్మశానంలో చోటు చేసుకున్న విషాదం.. కాలుతున్న చితిలో పడి పాపం.. !

మరణం ప్రతి జీవికి సహజంకానీ కొందరికి వచ్చే మరణం మాత్రం బాధాకరంగా ఉంటుంది.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూడా ఇలాంటి ఘోరం జరిగింది.

 An Old Woman Fell Nto A Burning Pit And Died Srikakulam, Ichapuram, Old Woman,-TeluguStop.com

కాలుతున్న చితిలో పడి ఓ వృద్ధురాలి మరణించింది.ఇలా శ్మశానంలో చోటు చేసున్న విషాద ఘటన గురించి తెలుసుకుంటే.

ఇచ్చాపురం పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన జమున మహంతి (72) అనే వృద్దురాలు అనారోగ్యంతో మృతి చెందగా ఆమెకు కండ్రవీధి శ్మశానవాటికలో గురువారం దహన సంస్కారాలు నిర్వహించారు.కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కస్పా గౌడవీధికి చెందిన రెయ్యి చంద్రమ్మ (66) మహిళ, అందరు అక్కడి నుండి వెళ్లిన తర్వాత మండుతున్న చితిలో దూకేసింది.

అయితే ఈ విషయాన్ని ఒక పశువుల కాపరి గుర్తించాడు.అప్పటికి ఆ మహిళను కాపాడటానికి చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో ఆ చితిలోనే కాలిపోయిందట.

కాగా ఇదే అదే శ్మశాన వాటిక వద్ద ఆమె మృతదేహానికి పంచనామ నిర్వహించి అత్యక్రియలు పూర్తి చేశారట బంధువులు.ఇకపోతే చంద్రమ్మ భర్త ఈ మధ్య కాలంలో మరణించాడని, అప్పటి నుండి ఆమె మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తుందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.

కానీ మండుతున్న చితిలో పడి మరణించడం ఎంత దారుణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube