ఇటీవల కాలంలో దారుణ హత్యలు( Brutal murders ) చేయడమే కాకుండా మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి నిర్మానుష్య ప్రాంతాలలో వేస్తున్నారు.మనిషి అడవిలో ఉండే మృగాల హీనంగా ప్రవర్తిస్తూ చిన్నచిన్న గొడవలు, మనస్పర్ధలకే కఠినమైన నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
ఇలాంటి కోవకు చెందిన ఓ దారుణ హత్య కేరళలో ( Kerala )చోటు చేసుకుంది.హత్య కు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.కేరళలోని కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్( Siddique ) (58) అనే హోటల్ యజమానిని ఓ యువ జంట దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఓ ట్రాలీ బ్యాగ్ లో తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో పారేశారు.
ఈ ఘటన బయటపడడంతో తీవ్ర విషాదం నెలకొంది.
సిద్ధిఖ్ వ్యాపార నిమిత్తం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కోజికోడ్ జిల్లాలో( Kozhikode district ) ఒంటరిగా నివసిస్తూ అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల దగ్గరకు వస్తూపోతూ ఉండేవాడు.అయితే సిద్ధిఖ్ కుమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సిద్ధిఖ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, తండ్రి డెబిట్ కార్డ్ నుండి లక్ష రూపాయలు డ్రా చేసినట్లు తన ఫోన్ కు మెసేజ్ రావడంతో ఏం జరిగిందో అని కంగారు పడి సిద్ధిఖ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.
ఈనెల 18న కోజికోడ్ లోని ఎరంజిపాలెం లో ఉండే ఓ హోటల్లో B2, B3 గదులను సిద్ధిఖ్ బుక్ చేసుకున్నాడు.ఇదే హోటల్లో పాలక్కడ్ కు చెందిన శిబిల్( Shibil ) (22), ఫర్హానా( Farhana ) (18) లు ఓ గదిలో దిగారు.
ఆ తరువాత శిబిల్, ఫర్హానా లు ఓ ట్రాలీ బ్యాగుతో హోటల్ నుండి బయటకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.సిద్ధిఖ్ హోటల్ లోపలికి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలు లో రికార్డ్ అయ్యాయి.
కానీ సిద్ధిఖ్ బయటకు వెళ్లినట్టు సీసీ కెమెరాలు కనిపించకపోవడంతో శిబిల్, ఫర్హానా లపై అనుమానంతో వీరి కోసం గాలించగా చెన్నైలో ఇద్దరు నిందితులు దొరికారు.శుక్రవారం ఉదయం చెన్నై పోలీసులు నిందితులను కేరళ పోలీసులకు అప్పగించారు.
వీరిని విచారించగా హత్య విషయం బయటపడింది.అయితే గతంలో శిబిల్, సిద్దిఖ్ హోటల్లో పనిచేసేవాడు.
శిబిల్ ప్రవర్తన సరిగా లేని కారణంగా పనిలో నుంచి తొలగించడం జరిగింది.హత్య కు గల కారణాల కోసం పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.