టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో, సభల సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై విజయవాడలో విచారణ జరగనుంది.ఈ ఘటనపై జస్టిస్ శేషశయనా రెడ్డి కమిషన్ విచారణ చేపట్టనుంది.
విజయవాడలోని ఏకసభ్య కమిషన్ చేపట్టనున్న విచారణకు కందుకూరు టీడీపీ నేతలు రాజేశ్, నాగేశ్వరరావులు హాజరుకానున్నారు.అనంతరం నివేదికను కమిషన్ ప్రభుత్వానికి అందజేయనుంది.
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే గుంటూరు జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తి అయింది.
ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.