కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు వీడు మగాడ్రా బుజ్జీ అని, అటువంటి సంఘటనలు ఇంకో విధంగా చింత చచ్చినా పులుపు మారదు అన్న చందంగా ఉంటుంది కొందరి పరిస్థితి.చూసి మనం చర్చించుకోవడం తప్ప మనకు ఏం చేసే అవకాశం ఉండదు.
ప్రస్తుతం కరోనా రోగులు ఆసుపత్రి బెడ్ల మీద ఆక్సీజన్ అందక ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ కనిపిస్తున్న పరిస్థితి.ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలను చూసినప్పుడు చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది.
ఆ సదరు రోగి కూడా మానసికంగా బలహీనంగా తయారవుతాడు.కాని మీరిప్పుడు చూస్తున్న ఈ ఫోటోలోని వ్యక్తి చూడండి ఏం చేస్తున్నాడో.
మొత్తం బాడీకి మొత్తం ఆక్సీజన్ పైపులు బిగించినా సరే చేతిలో తంబాకు నలుచుకుంటూ వైద్యం తీసుకుంటున్నాడు.ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆ సదరు వ్యక్తిపై మండి పడుతున్నారు.
ఆసుపత్రి బెడ్ ఆ పనేంటి నాయనా అని సెటైర్ లు వేస్తున్న పరిస్థితి ఉంది.ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో నెటిజన్ల సెటైరికల్ కామెంట్స్ తో వైరల్ గా మారుతోంది.
నీకు అసలు ప్రాణ భయం ఉందా బ్రదర్ అని కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఏకంగా ఆసుపత్రిలోనే ఈ పని చేస్తున్నావ్ ఇక అసలు భయం ఉన్నదని మాకు అనిపించటం లేదని మరికొంత మంది తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు.