మన ఆఫీసులో బాస్ను మెప్పించేందుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కొంతమంది పని చేసినా, చేయకపోయినా.
బాస్ ను మెప్పించాలని ఉద్దేశంతో ఆయనకు అవసరం లేని సేవలను కూడా చేస్తూ ఉంటారు.ఇలాంటి వారిని మనం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళలో ఎంతోమందిని గమనిస్తూనే ఉంటాం.
అయితే బాస్ ను మెప్పించాలంటే కొందరు నిజాయితీగా పనిచేసి శబాష్ అనిపించుకున్నారు.మరికొందరు బాస్ ను మెప్పించాలనే ఉద్దేశంతో ఆయన చుట్టూ చేరి భజన కార్యక్రమం మొదలు పెడతారు.
ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే మహిళ మూడో రకం.అందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.
ఓ మహిళ తాను నిజాయితీగా పని చేయడమే కాకా.దాన్ని నిరూపించుకోవడానికి చేసిన పని నిజంగా ఔరా అనిపించేలా ఉంది.ఇందుకు సంబంధించి చైనా దేశంలోని షాంగ్ డాంగ్ లో గల ఫర్టిలైజర్స్ కంపెనీలో ఓ మహిళ క్లియర్ గా పనిచేస్తుంది.అయితే ఆవిడ చేసిన పనిని నిరూపించడానికి ఏకంగా టాయిలెట్ గుంతలో ఉన్న నీటిని ఓ గ్లాసు తీసుకుని అందరిముందే ఆ నీటిని తాగేసింది.
అయితే ఇందుకు కారణం లేకపోలేదు.తాను చేసిన పనిని ఎంత శుభ్రంగా ఉంటుందో చెప్పడానికి ఈ పని చేసింది.
ఈ సందర్భంగా ఆవిడ చేసిన పనికి ఆఫీసులోని బాస్, అలాగే ఇతర సిబ్బంది చూసి షాక్ కి గురయ్యారు.ఆమె అలా చేస్తుంటే మిగతా వారందరూ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయారు.
చివరికి ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ అందరూ చప్పట్లు కొట్టి ఆమెను అభినందించారు.ప్రస్తుతం ఈ తతంగం మొత్తం సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూడండి.