తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ పెద్ద సినిమాల పై కంటే చిన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లపై ఎక్కువ దృష్టి పెడుతుంది.పెద్ద బడ్జెట్ సినిమాలు తీసుకున్నా చిన్న సినిమాలు తీసుకున్న కలిగే ప్రయోజనం ఒక్కటే అవ్వడం వల్ల కోట్లు పెట్టి సినిమాలు కొనుగోలు చేయడం కంటే మూడు నాలుగు వెబ్ సిరీస్ లను ఒక్క సినిమా బడ్జెట్ తో తీయడం వల్ల అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందని మొదటి నుండి ఆహా వారు భావిస్తున్నారు.
అందులో భాగంగానే ఆహా టాక్ షో లు మరియు వెబ్ సిరీస్ లను తీసుకు వచ్చారు.ఇంకా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆహా నుండి కంబాలపల్లి కథలు అనే వెబ్ సిరీస్ రాబోతుంది.అందులో భాగంగా పలు చాప్టర్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మొదటి చాప్టర్ గా ‘మెల్’ ను తీసుకు వస్తున్నారు.ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయ్యింది.సంక్రాంతి కానుకగా ఈనెల 12న స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ వెబ్ సిరీస్ ను మహానటి సినిమాను నిర్మించిన స్వప్నదత్ మరియు ప్రియాంక దత్ లు నిర్మిస్తున్నారు.వీరి నుండి వస్తున్న వెబ్ సిరీస్ అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల్లో మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా వెబ్ సిరీస్ ఉంటుందనే నమ్మకంను ట్రైలర్ కలిగిస్తుంది.
తప్పకుండా ఆహా లో ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే అని చాలా మంది భావిస్తున్నారు.వరుసగా ఆహా నుండి వస్తున్న వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి.
ఖచ్చితంగా ఇది కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం ఖాయం అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.