నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలే గానీ వయసుతో ఎలాంటి సంబంధం లేదు కదా.ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది ఫ్రూవ్ చేశారు.
వయసుతో సంబంధం లేకుండా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు.ఇప్పుడు మనం ఇలాంటి మహిళ గురించే తెలుసుకోబోతున్నాం.
ఆ మహిళకు పార్కిన్సన్స్ అనే అరుదైన వ్యాధి సోకింది.దీనికి ఇప్పటి దాకా సరైన మందు కనిపెట్టలేకపోయారు సైంటిస్టులు.
ఇక ఆ మహిలకు వ్యాధి సోకి చాలా రోజులవుతోంది.దీంతో అది కాస్తా ముదిరి ప్రాణాల మీదకు వచ్చేసింది.
ఈ సమయంలో ఆ వృద్ధురాలు ఓ కోరిక కోరింది.
తన కుమారుడిని దగ్గరకు తీసుకుని తనకు విమానం నడపాలని ఉందని చెప్పడంతో అది తన చివరకు గా భావించిన కొడుకు ఎర్ల్ గేజ్ అందుకోసం చాలానే ప్రయత్నించారు.ఆ మహిళ గతంలో పైలట్గా పనిచేసింది.84 ఏళ్ల మైర్తా గేజ్ యవ్వనంలో ఉన్నప్పుడు పైలట్గా పనిచేసి చివరకు ఈ వ్యాధి బారిన పడిపోయింది.కాగా ఇప్పటికీ తనలో ఆ విమానం నడపాలనే కోరిక బలంగా ఉండటంతో అది అర్థం చేసుకున్న కొడుకు అధికారులతో మాట్లాడి ఈ ఏర్పాట్లు చేశారు.పైగా అతను కూడా తన తల్లి వెంటే ఉన్నాడు.
తల్లి చివరి కోరిక మేరకు అధికారులను ఒప్పించి మరీ తన తల్లి వెంటే ఉండి ఆమెకు విమానం నడపడంలో సహాయం చేస్తూ ఆమె కోరికను నెరవేర్చాడు.నిజానికి అంత వయసున్న వారు విమానం నడిపేందుకు రూల్స్ ఒప్పుకోవు.కానీ ఆమె గతంలో పైలట్ గా సేవలందించినందుకు గాను అధికారులు ఆమెకు ఈ బహుమానం అందజేశార.మాటిఎల్లో అనే అధికారి ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేడదికగా పంచుకున్నారు.
ఆమె విమానం నడుపుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.మీరు కూడా చూసేయండి.