ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతోమందిని అతలాకుతలం చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.అయితే ఈ కరోనా నుండి అనేకమంది విశ్లేషణతో కూడిన వివరాలను అందజేస్తున్న కానీ కొంత మంది జనాలు వారి మూఢనమ్మకాలతో వారి ప్రాణాలమీదికి తీసుకుంటున్నారు.
ఎవరో ఏదో చెప్పారని ముందు వెనుక ఆలోచించకుండా ప్రాణాలు కోల్పోతున్నారు కొంతమంది అమాయకులు.ఇదివరకు సోషల్ మీడియాలో చూశానని ముక్కులోకి నేరుగా నిమ్మకాయ రసం వేసుకుంటే కరోనా రాదని నమ్మి ఓ ప్రభుత్వ టీచర్ తన ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి కూడా మనకి తెలిసిన విషయమే.
ఈ విషయం ఇంకా మరువకముందే అలాంటి దారుణం మరొకటి జరిగింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ఓ మహిళ కరిగించిన వెండి తాగుతే కరోనా సొకదని, దానిని అమ్మి ఆమె కరిగించిన వెండిని నేరుగా తాగడంతో చివరికి మహిళ మరణించింది.కొలారాడలో ఈ వింత సంఘటన జరిగింది.
అమి క్లారిసన్ అనే ఓ మహిళ ఒక ఆధ్యాత్మిక సంస్థను నడుపుతోంది.ఆమెని వారి శిష్యులు ‘మదర్ ఆఫ్ గాడ్‘ అని కూడా పిలుస్తుంటారు.
నిజానికి ఈవిడ గత కొన్ని రోజుల కిందటే చనిపోయింది.ఈ విషయం పోలీసులకు కాస్త నిదానంగా తెలియడంతో పోలీసులు ఆవిడ ఇంటికి వెళ్లి చూడగా ఆశ్చర్యపోయారు.
అక్కడ ఆమె శిష్యులు ఒక పది మంది దాకా ఉండడం.వారందరూ ఆవిడ మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి బాక్స్ లో పెట్టి ఉంచారు.
ఆ శవ పెట్టకు చుట్టూ విద్యుత్ దీపాలు అలంకరించి వాటికి పూజలు, భజనలు చేస్తున్నారు.దాంతో అక్కడ జరుగుతుంది అర్థం కాక పోలీసులు అక్కడ ఉన్న వారిని అందరిని అదుపులోకి తీసుకొని.
ఆవిడ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.ఇలా పోస్టుమార్టానికి పంపించడంలో పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి.
పోస్టుమార్టంలో క్లరిసన్ చనిపోయి దాదాపు 40 రోజులు పైనే ఉంటుందని డాక్టర్లు తెలియజేశారు.వీటితో పాటు ఆవిడ చనిపోయేముందు ద్రవరూపంలో ఉన్న వెండి ని చాలా పెద్ద మొత్తంలో తీసుకోవడంవల్ల ఆవిడ చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.
దీంతో ఇప్పుడు పోలీసులు ఆవిడ శిష్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.