సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) వ్యతిరేక సభలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అనుకూల నినాదాలు చేసి అమూల్య లియోనా అనే అమ్మాయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ఇక ఆమెని పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు.
అయితే రాత్రికి రాత్రి ఒకే ఒక్క మాటతో ఫేమస్ అయిపోయిన ఈ అమ్మాయిని వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు, ఏమైనా దేశ వ్యతిరేక శక్తులతో లింకులు ఉన్నాయా అనే విషయాలని పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఆమెకి సంబందించిన పాత వీడియోలు కూడా సేకరించే పనిలో ఉన్నారు.
మరో వైపు ఈమె తండ్రి కూడా అమూల్య చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెని ఏం చేసిన తమకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.దేశ వ్యతిరేక పనులు చేయొద్దని ఆమెకి చాలా సార్లు తాను చెప్పానని ఆమె తన మాట వినలేదని తెలిపాడు.
ఇదిలా ఉంటే అమూల్యకి నక్సల్స్తో సంబంధాలు ఉన్నాయని కర్నాటక సీఎం యడియూరప్ప మరో సంచలన విషయాన్ని బయటకి తీసుకొచ్చారు.అమూల్య లాంటి వారి వెనుక ఉన్న సంస్థలు, వారిని పెంచి పోషిస్తున్నవారిపై చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృత్తం అవుతూనే ఉంటాయని, లా ఆండ్ ఆర్డర్ను దెబ్బతీసేందుకు ఇదో కుట్ర అని సీఎం చెప్పారు.
అమూల్యకు గతంలో నక్సల్స్తో సంబంధాలున్నాయని తెలుస్తోందని అన్నారు.ఆమెకి నక్సల్స్ తో ఉన్న సంబంధాలు అన్ని బయటకి తీసుకురావాలని అన్నారు.
మరో వైపు అమూల్య తరహాలోనే మరో అమ్మాయి కూడా బెంగుళూరులో పాకిస్తాన్ ని అనుకూలంగా ఫ్లా కార్డులు ప్రదర్శించడంతో ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
.