కరోనా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు షూటింగ్ ల నుంచి రిలీజ్ ల వరకు అన్ని ఆగిపోయాయి.
లాక్ డౌన్ కారణంగా నిర్మాతలు కోట్ల రూపాయిలు నష్టపోతున్నారు.అయిన వేచి చూడక తప్పని పరిస్థితి.
పెద్ద సినిమాల నిర్మాతలు అయితే ఈ నష్టాన్ని ఏదో ఒక విధంగా భరిస్తారు.అయితే చిన్న సినిమా నిర్మాతల పరిస్థితి వేరు.
రెండు, మూడు కోట్ల రూపాయిలు పెట్టి సినిమాలు తీసే చిన్న నిర్మాతలకి సినిమా రిలీజ్ కాకపోయినా, షూటింగ్ జరగకపోయినా చాలా సమస్యలు ఎదుర్కొంటారు.ఈ నేపధ్యంలో షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ కి రెడీగా ఉన్న చిన్న సినిమాలని డిజిటల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేయడానికి చిన్న నిర్మాతలు రెడీ అవుతున్నారు.
డిజిటల్ రెవెన్యూ బాగుండటంతో చానల్స్ కూడా చిన్న సినిమాలని షేరింగ్ పార్టనర్ షిప్ తో కొనేసి తమ చానల్స్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాయి.
ఈ నేపధ్యంలో అమృతారామమ్ అనే చిన్న సినిమా డిజిటల్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న మొదటి తెలుగు సినిమాగా నిలబవోతుంది.
నిజానికి ఈ సినిమా మార్చి 25న థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది.లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.
ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్ థీయాట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది.అయితే రిలీజ్ ఆగిపోవడంతో అతను వెనక్కి తగ్గాడు.
దీంతో ఈ చిన్న సినిమా దర్శక నిర్మాతలు ఇటీవలే ఈ సినిమా డిజిటల్ హక్కులను విక్రయించారు.ఇక ఈ సినిమా ఏప్రిల్ 29 నుండి జీ5 లో ప్రసారం కానుంది.
ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాం లో మంచి కలెక్షన్స్ రాబడితే ఇక చిన్న సినిమాల నిర్మాతలు అందరూ ఇదే దారిలో వెళ్తారు.ఇక ఆహాతో ఓటీటీ స్టార్ట్ చేసిన అల్లు అరవింద్ కూడా చిన్న సినిమాలు కొనడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.
మరి అమృతారామమ్ సినిమా తరహాలో ఎన్ని చిన్న చిత్రాలు డిజిటల్ ప్లాట్ ఫాంలోకి వచ్చేస్తాయో అనేది వేచి చూడాలి.