బుల్లితెర ప్రేక్షకులకి భాగా చేరువ అయిన కామెడీ సీరియల్ అమృతం.ఏకంగా ఐదేళ్ళ పాటు నిర్విరామంగా నడిచిన ఈ సీరియల్ గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో వచ్చింది.
బుల్లితెరపై ఈ సీరియర్ ఎన్ని నవ్వులు పూయించిందో అందరికి తెలిసిందే.ఈటీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్ కి సినిమా వెర్షన్ గా సీక్వెల్ ప్లాన్ చేసి చందమామపై అమృతం అంటూ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
అయితే ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.తరువాత అమృతం సీరియల్ కూడా ఆపేశారు.
టెలివిజన్ పై సూపర్ సక్సెస్ అయిన ఈ అమృతం సీరియల్ ఎపిసోడ్స్ ఇప్పటికి యుట్యూబ్ లో సందడి చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమృతం సీరియల్ కి సీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు.
త్వరలో జీ5 ద్వారా ఈ వెబ్ సిరీస్ రూపంలో ఇది ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.దీనిని గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్ గుణ్ణం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇందులో అమృతం సీరియల్ లో గుండు హనుమంతరావు చేసిన అంజి పాత్ర ప్రేక్షకులకి భాగా చేరువ అయ్యిందో అందరికి తెలిసిందే.అతను చనిపోవడంతో ఇప్పుడు ఆ పాత్ర కోసం ఎల్ బి శ్రీరామ్ ని ఎంపిక చేశారు.
మిగిలిన పాత్రలలో గతంలో చేసిన వారే నటిస్తున్నారు.మరి సూపర్ హిట్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.