నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి అత్యంత దారుణంగా హత్య చేయించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రణయ్ కేసు విచారణ వేగంగా జరుగుతోంది.
ఈ కేసులో ప్రధాన నిందితులు మారుతీరావు, MA కరీమ్, శ్రావణ్లపై తాజాగా పీడీయాక్ట్ కూడా ప్రయోగించారు.
ఇంతకముందు అమృత ఇంట్లో అగంతకుడు తచ్చాడడం సంచలనంగా మారింది.వారి సిసి టివి ఫుటేజిలు పరిశీలించగా శనివారం తెల్లవారు జామున ఓ వ్యక్తి వారి ఇంటి ముందు కలియ తిరిగాడు.గోడ ఎక్కి బాల్కానీలోకి వచ్చినట్టు గుర్తించారు.
ఆగంతకుడు ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు.అప్పుడే అటుగా వచ్చిన పోలీసులను చూసి ఆగంతకుడు పారిపోయాడు.
దీనికి సంబంధించి ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి సంచలనమయ్యింది.
ఇప్పుడు తాజాగా మరోసారి అమృత కు సంబందించిన మరో వార్త బయటకి వచ్చింది.పట్టణంలోని కార్తిక్ టెక్స్టైల్స్ దుకాణం నిర్వాహకుడు గుండా వినోద్కుమార్ ప్రణయ్ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుని ఇంటికి వస్తున్నాడు.ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రణయ్ కుటుంబ సభ్యులు అతడి సెల్ఫోన్ను పరిశీలించగా ప్రణయ్ భార్య అమృత తల్లితో మాట్లాడినట్లు అతడిసెల్లో ఉంది.
వారి ప్రోద్బలంతోనే వినోద్కుమార్ తమ ఇంటికి వస్తున్నాడని గుర్తించి అతడిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.కేసు నమోదుచేశారు.