2018 సంవత్సరంలో నల్గొండ జిల్లా కు చెందినటువంటి అమృత, ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంగా అమృత భర్త ప్రణయ్ ని ఆమె తండ్రి మారుతీరావు సుఫారి ఇచ్చిచంపించిన ఘటన అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది.అయితే ఈ హత్య జరిగిన సమయంలో పలు ప్రజా సంఘాల నాయకులు మరియు నాయకులు కూడా అమృతకి బాగానే అండగా నిలబడ్డారు.
పోలీసులు కేసును ఛేదించిన అనంతరం ఈ హత్యకు పాల్పడింది అమృత తండ్రి మారుతీరావు అని నిర్ధారించే అతడిని అరెస్టు చేశారు.ఈ మధ్యకాలంలోని మారుతీరావు కి బెయిల్ మీద బయటకు వచ్చాడు.
అయితే ఏమైందో ఏమో గాని నిన్నటి రోజున మారుతీరావు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజాగా ఈ విషయంపై మృతుడు మారుతీ రావు కూతురు అమృత స్పందించింది.
ఇందులో భాగంగా అమృత మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి చనిపోయిన విషయం అధికారికంగా తనకు తెలియదని తాను కూడా టీవీలో వస్తున్నటువంటి కథనాలను చూసి తెలుసుకున్నానని అన్నారు.అయితే ఓ పత్రికా విలేకరి మీ తండ్రిగారి ఆత్మహత్యకి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించగా అందుకు అమృత సమాధానం చెబుతూ తన భర్త ప్రణయ్ నీ చంపించినందుకు పశ్చాత్తాప పడి ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పుకొచ్చింది.
అలాగే అప్పట్లో అమృత తన భర్త ప్రణయ్ ని చంపించినందుకుగానూ తండ్రి మారుతీ రావు పై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటే తన ఆస్తి మొత్తం తనకే రాసిస్తానని అని అప్పట్లో పలు కథనాలు వినిపించాయని ఇది వాస్తవమేనా అని అడగగా అమృత తను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయిన అప్పటి నుంచి ఇప్పటివరకు తన తండ్రిని ఒక్కసారి కూడా కలవలేదని అన్నారు.అవన్నీ అవాస్తవలే అని అన్నారు.