తల్లి గిరిజను కలిసిన అమృత... మారుతీరావు చివరి కోరిక తీరేనా..?

నిన్న మారుతీరావు కూతురు అమృత పోలీసుల సహకారంతో తల్లి గిరిజను కలిశారు.తండ్రి మరణించిన వారం రోజుల తరువాత అమృత ఆమె తల్లిని కలవడంతో అక్కడ ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది.

 Amrutha Meets Her Mother-TeluguStop.com

దాదాపు అరగంట పాటు అమృత తన తల్లితో ఏకాంతంగా మాట్లాడారు.అమృత తన బాబాయ్ శ్రవణ్ తో కూడా కొంతసేపు మాట్లాడారని సమాచారం.

అమృత తన తల్లిని కలవడంతో ఏం మాట్లాడారనే విషయం చర్చనీయాంశం అయింది.

ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ లోని ఆర్యవైశ్యభవన్ లో అమృత తండ్రి మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

విషం తాగడంతో రక్తప్రసరణ ఆగిపోయి గుండెపోటు వచ్చి మారుతీరావు చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.మారుతీరావు చనిపోక ముందు ” గిరిజా క్షమించు… అమృత తల్లి దగ్గరకు వెళ్లిపో” అని సూసైడ్ నోట్ రాశారు.

ఈ సూసైట్ నోట్ పై గతంలోనే స్పందించిన అమృత తాను ప్రణయ్ తల్లిదండ్రులను వదిలి వెళ్లలేనని స్పష్టంచేసింది.

Telugu Amruthameet, Amruthastay-Movie

తాజాగా మరోసారి తన తల్లి దగ్గర అమృత ఇదే విషయం ప్రస్తావించినట్లు సమాచారం.తల్లి తన దగ్గరకు వస్తే ఎటువంటి అభ్యంతరం లేదని తాను మాత్రం ప్రణయ్ తల్లిదండ్రులను విడిచి రాలేనని అమృత మరోమారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.అమృత అలా చెప్పడంతో మారుతీరావు చివరి కోరిక తీరేనా…? అనే ప్రశ్న వినిపిస్తోంది.అమృత తన తల్లిని పరామర్శించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ అయింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube