తెలుగులో ముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కోలీవుడ్ బ్యూటీ అమృతా అయ్యర్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది.
అంతేగాక ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం అనే పాట ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిపివేయడంతో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
దీంతో అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.
అయితే తాజాగా అమృతా అయ్యర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మొహానికి జేబు రుమాలు ధరించి తీసుకున్నటువంటి ఫోటో ని షేర్ చేసింది.
అంతేగాక ఈ ఫోటోకి కళ్ల ద్వారా తనతో మాట్లాడాలని క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
దీంతో కొందరు నెటిజన్లన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ అందమైన మొహానికి ఎందుకు జేబు రుమాలు అడ్డు పెట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతే కాకుండా ఈ ఫోటో ని షేర్ చేసిన 18 గంటల లోపే దాదాపుగా లక్షా 74వేల పైచిలుకు లైకులు వచ్చాయి.
కాగా ప్రస్తుతం అమృతా అయ్యర్ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 14 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మడికి సోషల్ మీడియా లో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో లిఫ్ట్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి తమిళ నూతన దర్శకుడు వినీత్ వర ప్రశాంత్ దర్శకత్వం వహిస్తుండగా ఎకా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. దీంతో ఇటీవలే తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు మరియు హీరో జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో కూడా అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.