పంజాబ్ రాష్ట్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత అమృత పాల్ సింగ్( Amrita Pal Singh ) నీ జలంధర్ లో పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది.
సినీ ఫక్కీలో చేజింగ్ చేసి అమృత్ పాల్ నీ ఆయనతో పాటు ఆరుగురు మద్దతుదారులను అరెస్టు చేశారు.అంతకముందు తనని కాపాడాలంటూ సోషల్ మీడియాలో అమృతపాల్ లైవ్ పెట్టడంతో పంజాబ్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
దీంతో పంజాబ్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న ఆరోపణలతో ఆయనని అరెస్టు చేయడం జరిగింది.
ప్రస్తుతం పంజాబ్( Punjab ) లో G20 సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విగాథం కలిగిస్తారన్న అనుమానాలతో అమృత పాల్ నీ అరెస్టు చేయడం జరిగింది.అరెస్టుకు ముందు తనని కాపాడాలంటూ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడటం జరిగింది.దీంతో పంజాబ్ లో ఎక్కడ అల్లర్లు కాకుండా ముందస్తు జాగ్రత్తగా.
పోలీస్ బలగాలు రంగంలోకి దిగటం మాత్రమే కాదు ఇంటర్నెట్ సేవలు కూడా ఆపేశారు.అమృత పాల్ నీ అరెస్టు చేయటానికి దాదాపు 50 వాహనాల్లో పోలీసులు వచ్చారు.
ఈ క్రమంలో ఆయన మద్దతుదారులను కూడా అరెస్టు చేయడం జరిగింది.జలంధర్ సమీపంలోని మహాత్పూర్ లో ఓ గురుద్వార్ లో ఆశ్రయం తీసుకుంటున్న అమృతపాల్… ఖలిస్థాన్ వేర్పాటువాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.