మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకేసు ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.అమృతని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆమె తండ్రి మారుతీరావు కిరాయి రౌడీలతో అతనిని హత్య చేయించాడు.
ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.తరువాత నిందితుడుగా జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద వచ్చిన మారుతీరావు తాజాగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఆత్మహత్యతో ఈ ఉదంతం మరోసారి వార్తలలోకి వచ్చింది.అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మారుతీరావు కూతురు తండ్రి ఆత్మహత్య విషయంలో కాస్తా నిర్లక్ష్యంగా మాట్లాడింది అనే ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటె తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రత కోరింది.అయితే తండ్రిని చూసేందుకు తల్లి గిరిజ, బాబాయి శ్రవణ్ అంగీకరించలేదు.మారుతీ రావు స్వగృహంలో మృతదేహానికి బంధువులు, సన్నిహితులు నివాళులు అర్పిస్తున్నారు.ఉదయం 10 గంటలకు మారుతీరావు అంతిమయాత్ర మొదలు కానుంది.
మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటిక లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.మారుతీరావు అంతిమ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమృత కడచూపు చూసేందుకు ఆమె తల్లి అస్సలు అంగీకరించలేదు.