బాలీవుడ్ ఎంట్రీతోనే వరుసగా రెండు సినిమాలు ఒకే హీరోతో చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్న నటి అమ్రిన్ ఖురేషి.ప్రముఖ నిర్మాత షాజిద్ ఖురేషి నిర్మిస్తున్న సినిమా చూపిస్త మామ రీమేక్ లో అతని కూతురైన అమ్రిన్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది.
తరువాత జులాయి రీమేక్ లో కూడా ఈ భామ నటిస్తుంది.పక్కా హైదరాబాదీ అయిన అమ్రిన్ ఖురేషి తన మూవీ షూటింగ్ లో భాగంగా ఇక్కడికి వచ్చింది.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది.పలు ఆసక్తికర విషయాలు ఆమె పంచుకుంది.
తాను హైదరాబాద్ అమ్మాయిని అని చిన్న వయస్సు నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగానని చెప్పుకొచ్చింది.అల్లు అర్జున్ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని, బన్నీ డాన్స్ అంటే చాలా ఇష్టం అని పేర్కొంది.
ఎంట్రీ ముందుగా బాలీవుడ్ లోనే అయినా తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే తాను హీరోయిన్ సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్ అని, ఆమె డాన్స్, యాక్టింగ్ అంటే తనకి చాలా ఇష్టం అని అమ్రిన్ ఖురేషి పేర్కొంది.తెలుగులో సావిత్రి, సౌందర్య మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది.తెలుగులో అవకాశాలు వస్తున్నాయని, అయితే డేట్స్ చూసుకొని మంచి ప్రాజెక్ట్ ద్వారా ఎంట్రీ ఇస్తానని స్పష్టం చేసింది.
డాన్స్ అంటే తనకి ఇష్టం అని వచ్చే ఏడాది కచ్చితంగా తెలుగులో తన ఎంట్రీ ఉంటుందని అమ్రిన్ ఖురేషి పేర్కొంది.మొత్తానికి బాలీవుడ్ లో అడుగుపెట్టిన అమ్రిన్ ఖురేషికి తన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి తెలుగు హీరోల గురించి, ప్రత్యేకంగా సాయి పల్లవి గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.