తెలుగులో రీమేక్ సినిమాల్లో ఎక్కువగా నటించి ఆ సినిమాలతో సక్సెస్ సాధించిన హీరోగా వెంకటేష్ పేరు తెచ్చుకున్నారు.అసురన్ రీమేక్ నారప్పతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న వెంకటేష్ త్వరలో దృశ్యం2 సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
నారప్ప సినిమాలో ప్రియమణితో పాటు అమ్ము అభిరామి నటించిన సంగతి తెలిసిందే.అమ్ము అభిరామి క్యూట్ ఎక్స్ ప్రెషన్లు నారప్ప సినిమాకు హైలెట్ అవుతాయి.
ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అమ్ము అభిరామి కనిపించింది కొంత సమయమే అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.తాజాగా ఈ బ్యూటీ వెంకటేష్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వెంకటేష్ ను ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో చూశానని ఆమె అన్నారు.ఆ సినిమాలో వెంకటేష్ తనకు చాలా స్మార్ట్ గా కనిపించారని అమ్ము అభిరామి అన్నారు.
వెంకటేష్ ఒక సెల్ఫీ తీసుకోవాలని భావించిన తనకు నారప్ప సినిమాలో ఛాన్స్ దక్కిందని అమ్ము అభిరామి చెప్పుకొచ్చారు.
నారప్ప మూవీలో ఛాన్స్ దక్కడం పట్ల లక్కీ అని తాను భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.అయితే వెంకటేష్ కు జోడీగా నటించాలంటే తాను కంగారు పడ్డానని వెంకటేశ్ గారు తనకు ధైర్యం చెప్పారని అమ్ము అభిరామి చెప్పుకొచ్చారు.తనకు తెలుగు రాదని భాష రాకపోవడం వల్ల కొన్నిసార్లు తాను ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.
వెంకటేష్ తాను సీన్లలో బాగా నటించేలా హెల్ప్ చేశారని ఆమె చెప్పారు.
తెలుగు సినిమాల్లో ఆఫర్లు వస్తే కచ్చితంగా నటిస్తానని ఈ బ్యూటీ తన మనస్సులోని మాటను బయటపెట్టారు.అమ్ము అభిరామి తెలుగులో గతంలో కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.తెలుగులో అమ్ము అభిరామికి కొత్త సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.