హైదరాబాద్కు అమ్మోనియా నైట్రేట్ చేరుకుంది.లెబనాన్ రాజధాని బీరూట్లో జరిగిన భారీ పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ రసాయన పదార్ధం ఇప్పుడు 8 కంటైనర్లలో హైదరాబాద్కు చేరుకుంది.
బీరూట్లో భారీ పేలుడు సంభవించడంతో భద్రతా చర్యల్లో భాగంగా చెన్నై పోర్టులో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ను హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసింది.మొత్తం ఎనిమిది కంటైనర్లలో తరలించిన నైట్రేట్ను కీసరగుట్టలో సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ నిల్వ చేసింది.
అమ్మోనియం నైట్రేట్ను సాల్వో కంపెనీ రీప్రాసెస్ చేయనుంది.రెండు రోజుల్లో రీప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తవుతోందని సాల్వో కంపెనీ పేర్కొంది.
రీప్రాసెస్ ప్రక్రియ అనంతరం కోల్ ఇండియా, సింగరేణి, నీటి పారుదల ప్రాజెక్టులకు సరాఫరా చేయనుంది.
ఐదేళ్ల క్రితం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్ను చెన్నై సమీపంలోని మనలిలో ఉన్న టెర్మినల్ వద్ద 37 కంటైనర్లలో నిల్వ ఉంచారు.
గతంలో చెన్నై వరదల సమయంలో 50 టన్నుల మేర అమ్మోనియం నైట్రేట్ నీటిలో, గాల్లో కలిసిపోయినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బీరూట్ లో జరిగిన భారీ పేలుడుతో చెన్నై కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.
దీంతో చెన్నైలో 37 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ ఉండగా 10 కంటైనర్లలోని 181 టన్నుల రసాయన మిశ్రమాన్ని హైదరాబాద్కు తరలించారు.
లెబనాన్ రాజధాని బీరూట్లో నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.ఈ భారీ పేలుడులో 200 మంది మృతి చెందగా.వేల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులు అయ్యారు.
దీంతో బీరూట్లో పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ తమ ప్రాంతంలో నిల్వ చేయడంపై కీసరగుట్ట వాసులు భయాందోళనకు గురవుతున్నారు.