పెద్దల ఎమరుపాటు చిన్నపిల్లలకు ప్రాణంతకంగా మారుతుందని ఎన్నో ఘటనలు నిరూపిస్తున్నాయి.ప్రస్తుతం ఇలాంటి ఘటనే నిన్న హైదరాబాద్లోని నాచారంలో చోటుచేసుకుంది.
ఆ పాప మరణానికి కారణం అమ్మ చీర అవ్వడం విషాదం.
ఇక పూర్తి వివరాలు చూస్తే.
నాచారంలో నివసించే వల్లూరి రమేశ్ కూతురు మనస్విని (9) నాలుగో తరగతి చదువుతున్నది.కాగా వీరి బాబు మానసిక వికలాంగుడు.
ఇకపోతే నిన్న ఈ దంపతులు ఇద్దరు పని నిమిత్తం బయటకు వెళ్లగా, ఆ పాప ఆడుకునే ఆటలో భాగంగా ఇంట్లో ఉన్న ఫ్యాన్ కొక్కానికి కుర్చివేసుకొని చీరెతో ఊయల కట్టి ఊగసాగింది.
ఈ క్రమంలో మెడకు చీరెచుట్టుకొని ఊపిరి ఆడక గిలగిలలాడుతూ మరణించింది.
ఆ సమయంలో అందుబాటులో ఎవరు పెద్దవారు లేకపోవడం దురదృష్టకరం.కాగా బయటకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి ఆ పాప చీరెలో విగతజీవిగా ఉన్నది.
పాపం అమ్మ చీరెతో ఆడుకోవాలనుకున్న ఆ పాప అనంతలోకాలకు పయణం అవడం ఆ తల్లిదండ్రులను విషాదంలో నింపింది.