తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.అయితే మొదటి వారం ఏడపులు పెడబొబ్బులతో నీరసంగా సాగినా.
రెండో వారం మాత్రం ఇంటి సభ్యులందరూ కాస్త ఫామ్లోకి వచ్చి బిగ్ బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.రకరకాల స్కిట్లు, డ్యాన్సులు, పాటలతో హోరెత్తిస్తున్నారు.
ఇలాంటి తురణంలోనే బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ స్ట్రోంగ్ కంటెస్టెంట్ గంగవ్వకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో.ఆమెకు హౌస్లోనే వైద్య పరీక్షలు చేస్తున్నారు.అయితే ఇదే సమయంలో బిగ్బాస్ వంటింట్లో టీవీ9 దేవి నాగవల్లి వేరు కుంపటి పెట్టేసింది.వంటింట్లో తాను ఉంటానంటూ మొదటి నుంచి రచ్చ చేస్తున్న దేవి నాగవల్లి.
మరోసారి వాదనకు దిగింది.
శుక్రవారం మార్నింగ్ మీరు చేసే ఫుడ్ తాను తిననంటూ చెప్పేసిన దేవి నాగవల్లి.
సెపరేట్గా ఫుడ్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేసింది.నామినేషన్ తరువాత మీరంతా కావాలనే నన్ను పక్కన పెడుతున్నారని దేవి ఇంటి సభ్యులపై ఫైర్ అయింది.
అయితే ఇదే విషయంపై అమ్మ రాజశేఖర్ మాస్టర్, దేవిల మధ్య డిస్కషన్ జరగగా.వివాదం మరింత పెద్దగా మారింది.
ఈ క్రమంలోనే వాయిస్ పెరిగితే ఒప్పుకోనంటూ అమ్మ రాజశేఖర్పై దేవి కౌంటర్ ఇచ్చింది.దీంతో నువ్ వాయిస్ పెంచి మాట్లాడొచ్చు.
నేను పెంచకూడదా.నువ్ పెంచితే నాది కూడా పెరుగుతుంది అంటూ దేవిపై రాజశేఖర్ మాస్టర్ మండిపడ్డారు.
చివరకు ఏదోలా ఈ చర్చ ముగిసింది.మరోవైపు కెప్టెన్ అయిన నోయల్.
హాట్ డిస్కషన్ తర్వాత కిచెన్ టీం కోసం యాంకర్ దేవితో మోనాల్, కళ్యాణి, లాస్యలను ఎంపిక చేశాడు.కాగా, ఈ వారం ఏకంగా తొమ్మిది మంది ఎలిమినేషన్కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
కరాటే కళ్యాణి, మోనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్, నోయల్, గంగవ్వలు నామినేషన్స్లో ఉన్నారు.