మూడు వారాల క్రితం కరోనా బారిన పడ్డ బచ్చన్ ఫ్యామిలీ దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన విషయం తెల్సిందే.ఎన్నో జాగ్రత్తల మద్య ఉండే బచ్చన్ ఫ్యామిలీకి కరోనా రావడంతో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ అంటూ అంతా కూడా ఒకింత ఆశ్చర్యంకు గురయ్యారు.
మొదట ఐశ్వర్యకు పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేకపోవడంతో స్వీయ నిర్భందంలో ఇంట్లోనే ఉంది.అయితే మరోసారి పాజిటివ్ రావడంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని ఐశ్వర్య ఆరాధ్య ఇద్దరు ఆసుపత్రికి చేరారు.
అంతుకు ముందే బచ్చన్ తండ్రి కొడుకులు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
దాదాపు రెండు వారాల పాటు నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఐశ్వర్య మరియు ఆరాధ్యలకు తాజాగా నెగటివ్ వచ్చింది.
రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో వారిద్దరిని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది.అయితే అమితాబ్ మరియు అభిషేక్లు మాత్రం ఇంకా పాజిటివ్గానే ఉన్నారని తెలుస్తోంది.
అమితాబ్ కాస్త వయసు ఎక్కువ అవ్వడం వల్ల ఆయన కోలుకోవడానికి సమయం పడుతుందని వైధ్యులు అంటున్నారు.ఇదే సమయంలో అభిషేక్ బచ్చన్ పరిస్థితి బాగానే ఉందని కాకుంటే కరోనా పాజిటివ్ తోనే ఆయన ఉన్నాడని వైధ్యులు అంటున్నారు.
మరో వారం రోజుల్లో జూనియర్ బచ్చన్ కూడా కరోనాను జయిస్తాడనే నమ్మకంను వైధ్యులు చెప్పారు.ఇక అమితాబ్ కోలుకోవడం అనేది కాస్త సమయం పట్టవచ్చు అంటున్నారు.కాని ఖచ్చితంగా ఆయన కరోనాను జయించడం మాత్రం పక్కా అన్నట్లుగా వైధ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అమితాబ్లో ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు వైధ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయన ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్లే కాస్త ఆలస్యం అవుతుంది అంటున్నారు.