పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన రాదే శ్యామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది.
ఈ క్రమంలోనే ఈయన తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు.ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే చిత్రంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇకపోతే తాజా షెడ్యూల్ హైదరాబాదులో సందడి ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే చిత్ర బృందం హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా అమితాబచ్చన్ హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో సందడి చేశారు.
మెట్రో రైల్వే స్టేషన్ లో ట్రైన్ సీక్వెన్స్ కోసం ఓ సన్నివేశంలో భాగంగా అమితాబచ్చన్ హైదరాబాద్ మెట్రో స్టేషన్ కి వెళ్లగా పెద్ద ఎత్తున అభిమానులు ఆయనను చూడటానికి అక్కడికి చేరుకున్నారు.ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైజయంతి మూవీస్ కొత్తగా ప్రారంభించిన ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా అమితాబచ్చన్ పాల్గొన్నారు.ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు.ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఇకపోతే ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ సరసన మొట్టమొదటిసారి దీపికా పదుకొనే నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.