దేశవ్యాప్తంగా ఆమీర్ ఖాన్ రచ్చ మళ్ళీ మొదలైంది.మొదట ఇంక్రిడబుల్ ఇండియా నుంచి ఆమీర్ ని మేము తొలగించలేదు అని అర్థం అయ్యి, అర్థంకాని ప్రకటన ఒకటి విడుదల చేసి, తిట్టిపోస్తున్న కాంగ్రేస్, ఆమ్ ఆద్మి పార్టిలను ఒక్కరోజు సైలెంట్ గా ఉంచిన బీజేపి, ఇప్పుడు అసలు బాంబు పేల్చింది.ఇంక్రిడబుల్ ఇండియా కోసం ఓ మీడియా ఏజెన్సితో ఒప్పందం ఉండిదని, అది ఇప్పుడు పూర్తి అయిపోయిందని, ఇక ఆమీర్ విషయం భవిష్యత్తు, భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేం అని, ఆమీర్ ని తొలగించట్లేదు కాని ఆమీర్ ఇకపై ఇంక్రిడబుల్ ఇండియాకి అవసరం లేడు అని చెప్పకనే చెప్పింది ప్రభుత్వం.
“గత పది సంవత్సరాలుగా దేశానికి ఈ విధంగా సేవలందించినందుకు సంతోషంగా ఉంది.ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న నేను గౌరవిస్తాను.ఇంక్రిడబుల్ ఇండియా కోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.భవిష్యత్తులో నా దేశానికి ఏ సేవ చేయమన్న చేస్తాను” అని ఆమీర్ నిన్న మీడియాకి సెలవిచ్చాడు.ఆమీర్ మాటల్ని బట్టి చూస్తే ఇక ఆమీర్ ఇంక్రిడబుల్ ఇండియాలో భాగం కాదనేసి స్పష్టంగా అర్థం అవుతోంది.
ఇక అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లలో ఒకరిని ఆమీర్ స్థానంలో ప్రభుత్వం ఎంచుకుంటుందని వార్తలు వస్తున్నాయి.అయితే అమితాబ్ బచ్చన్ ఇకపై ఇంక్రిడబుల్ ఇండియాకి ప్రచారకర్తగా వ్యవహరించడం ఖాయమని, ప్రభుత్వం దీనిపై ప్రకటన విడుదల చేయడమే మిగిలిందని జాతీయ మీడియా కోడై కూస్తోంది.