బిగ్ బి అమితాబచ్చన్ ఈ వయస్సులో కూడా ఏ మాత్రం జోరు తగ్గించకుండా వరుస సినిమాలు చేస్తున్నారు.హీరోగా ఉన్నప్పుడు ఎక్కువగా కమర్షియల్ చిత్రాలు చేసిన అమితాబ్ ఇప్పుడు మాత్రం ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నాడు.
చేస్తున్న ప్రతి సినిమాలో తన పాత్రల విషయంలో ప్రత్యేకత ఉండే విధంగా చూసుకుంటున్నారు.విభిన్న పాత్రలు చేస్తూ తాను ఎందుకు గొప్ప నటుడు అయ్యాడనే విషయం అందరికి అర్ధమయ్యేలా చేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ లో సైరా సినిమాలో అమితాబచ్చన్ స్వామీజీ పాత్రలో కనిపించి మెప్పించాడు.చిరంజీవిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపించిన వ్యక్తిగా ఇందులో అతని పాత్ర ఉంటుంది.
ఇప్పుడు మరోసారి తెలుగు పాన్ ఇండియా సినిమాలో అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అతనిని ఫైనల్ చేశారు.
ఈ సినిమా కోసం 40 రోజుల కాల్స్ షీట్స్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అమితాబచ్చన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
అక్షరాల 25 కోట్ల రూపాయలు నిర్మాతలు అతనికి ఇస్తున్నారని సమాచారం.సోషల్ మీడియాలో అమితాబ్ రెమ్యునరేషన్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.సినిమా మొత్తంమ్మీద ఆయన నిడివి కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 25 నిమిషాలకు 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని బిగ్బి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
అశ్వినిదత్ అంతేకాదు అమితాబ్ అడిగిన రెమ్యూనరేషన్ని మరో మాట లేకుండా ఇవ్వడానికి ఒకే చెప్పిందని సమాచారం.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న దీపికా పదుకునేకి కూడా 20 కోట్లు వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.
వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో నటించే నటులకి రెమ్యునరేషన్ రూపంలోనే వంద నుంచి 150 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది.