బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ సారధ్యంలో నడిచే రియాలిటీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ షోలో పాల్గొని ఎంతో మంది కోట్లు గెలుచుకున్నారు.
కోటి రూపాయిలు గెలుచుకోవడం అనేది చాలా కష్టమైన పని అయిన కొంత మంది ఆ ఫీట్ ని చేసి చూపించారు.అమితాబచ్చన్ కారణంగా ఈ షోకి ఆకర్షణ వచ్చింది.
విద్యావంతులు కూడా ఈ షోని ఫాలో అయ్యేవారు.ఇక ఈ రియాలిటీ గేమ్ షో స్ఫూర్తితో సౌత్ భాషలలో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ స్టార్ట్ చేశారు.
ఇక ఈ షో అన్ని భాషలలో కూడా మంచి హిట్ అయ్యింది.తెలుగులో కూడా మూడు సీజన్ లు ఈ షోని నడిపించారు.
తర్వాతి సీజన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు ఈ కేబీసీ సీజన్-12కి రంగం సిద్ధం అయ్యింది.
ఇప్పటికే ఈ సీజన్ షోని ప్రారంభించాల్సి ఉన్న కరోనా పరిస్థితి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఇక కరోనా బారిన పడి కోలుకున్న అమితాబ్ ఈ షో కోసం చాలా గ్యాప్ తర్వాత మరల ముఖానికి రంగు వేసుకున్నారు.
ఈ మేరకు ఆయన ఓ ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.కౌన్ బనేగా కరోడ్పతి 12వ సీజన్ షూటింగ్ ప్రారంభమైందని, తాను కూడా ఇందులో పాల్గొంటున్నానని అమితాబ్ పేర్కొన్నారు.
నీలం రంగు పీపీఈ కిట్స్ సముద్రంలో కేబీసీ-12 షూటింగ్స్ ప్రారంభం. కేబీసీ 2000లో ప్రారంభమైంది.ఇప్పటికి సరిగ్గా 20 ఏళ్లయింది.అద్భుతం.
ఓ జీవిత కాలానికి సమానం అంటూ అమితాబ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.ఇదిలా ఉంటే సిబ్బంది మొత్తం పీపీఈ కిట్లు ధరించి పూర్తి సీల్డ్ విధానంలో షూటింగ్ చేస్తున్నట్లు కేబీసీ యాజమాన్యం వెల్లడించింది.