బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఏడు పదుల వయసు దాటినా చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటారు.
ఇదే తరుణంలో అలనాటి ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ అప్పటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు బిగ్ బి. ఈ నేపథ్యంలో గతంలో కరోనా వైరస్ బారిన పడ్డ అమితాబ్ అతి తక్కువ టైమ్ లోనే కోరుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా కూలీ షూటింగ్ సమయంలో ఉంది జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకుని అప్పట్లో తన తండ్రి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో బిగ్ బి పోస్ట్ చేసి అప్పటి జ్ఞాపకాలు ట్విటర్లో పంచుకున్నారు.అమితాబ్ బచ్చన్ తాజాగా షేర్ చేసిన ఫోటోలో తన తండ్రిని తన తాతని ఆసక్తిగా పక్కనే ఉన్న అభిషేక్ బచ్చన్ గమనిస్తూ ఉన్నాడు.
ఇదిలా ఉంటే శనివారం ట్విట్టర్లో అమితాబ్ సరికొత్త రికార్డు సృష్టించారు.తన ఫాలోవర్స్ సంఖ్య శనివారం నాటికి 45 మిలియన్లకు చేరుకోవడంతో ట్విట్టర్ వేదికగా అమితాబ్ బచ్చన్ కి అభిమానులు విషెస్ తెలియజేశారు.