వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన వింతే.మనుషులు అంత ఒకలాగా ఉంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఒకవైపు ఉంటాడు.
అటువంటి వర్మ ఇప్పుడు వెరైటీగా.టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంత షాక్ అయ్యేలా ఓ సరికొత్త సినిమా తీశాడు.
నిజానికి ఆ సినిమా కేవలం టాలీవుడ్ నే కాదు ప్రపంచాన్నే షాక్ కి గురి చేసింది.
అంతలా రామ్ గోపాల్ వర్మ ఎం చేశాడు అంటే? కరోనా వైరస్ పై ప్రపంచంలో మొట్ట మొదటి సినిమా తీశాడు.దానికి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశాడు.అయితే ఈ ట్రైలర్ పై ప్రపంచమంతా స్పందిస్తుంది.అందరూ షాక్ అవుతున్నారు.ఇంకా ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమిత బచ్చన్ కూడా స్పందించాడు.
రాము అద్భుతంగా ‘కరోనా’ సినిమాను తెరకెక్కించాడు.దగ్గు ఎంత ప్రమాదకరమో సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారని చెప్పారు.రాము తనకు ఎన్నో సర్కార్లు ఇచ్చాడు అని అన్నారు.అంతేకాదు.తాజాగా లాక్ డౌన్ లో ఒక కుటుంబంలో చోటు చేసుకున్న కథ ఆధారంగా సినిమాను తియ్యడం చాలా గొప్ప విషయం అని అమితాబ్ అన్నారు.
ఇలా అందరూ రామ్ గోపాల్ వర్మ గ్రేట్ అని అంటుంటే.
రామ్ గోపాల్ వర్మ కూడా టాలీవుడ్ స్టార్స్ పై పంచ్ లు వేశాడు.ఈ లాక్ డౌన్ వేల అందరూ ఇల్ల ప్లోర్లు తుడుతూ, వంట వండుతూ, బట్టలు పిండుతూ ఇంకా ఇతర పనులు చేస్తుంటే తాను మాత్రం కరోనాపై సినిమా తీసినట్టు… అదే తన బలం అని ట్విట్ చేశాడు.
దీంతో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమా వైరల్ అవుతుంది.