ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టిస్తున్న పెద్దగా చెప్పనవసరం లేదు.ఇప్పటికే ఈ కరోనా వైరస్ కి భయపడి పలు సంస్థలు సెలవులు కూడా ప్రకటించాయి.
అంతేగాక పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రభుత్వ అధికారులు మూసివేశారు.అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం సినీ రంగంపై మాత్రం బాగానే పడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలు భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణ కూడా వాయిదా వేస్తూ షూటింగ్ నిలిపివేశారు.దీంతో ప్రస్తుతం ఆర్టిస్టులు ఖాళీగా గడుపుతున్నారు.
అయితే ఈ కరుణ వైరస్ పై తాజాగా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు.ఇందులో భాగంగా తన అభిమానులని తనను కలిసేందుకు కొంతకాలం పాటు రావద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు.
అంతేకాక ఈ కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ రాకుండా అడ్డుకోవచ్చని అన్నారు.అంతేకాక ప్రతి ఒక్కరు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అని, అలాగే జలుబు దగ్గు ఉన్నటువంటి వాళ్లు నోటికి మాస్కులు ధరించాలని సూచించారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ దాదాపుగా ఆరు చిత్రాల్లో నటిస్తున్నాడు.ఇందులో ముఖ్యంగా బ్రహ్మాస్త్ర అనే చిత్రం ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అయున్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ మౌని రాయ్ టాలీవుడ్ కింగ్ నాగార్జున తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు.భారీ బడ్జెట్ తో నిర్మించిన టువంటి చిత్రం పై అభిమానులు బాగానే అంచనాలు పెంచుకున్నారు.