యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రభాస్ 20’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను జిల్ చిత్ర డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటంతో ఇది ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక సాహో వంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ ఇందులో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి.ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల యూరప్ షెడ్యూల్ను ముగించుకుంది.
పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో, ఇది పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు చిత్ర రెడీ అవుతున్నారు.
అయితే ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమిత్ త్రివేది ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.ప్రభాస్ 20వ చిత్రానికి తాను సంగీతం అందిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు.
దీంతో ఈ సినిమాకు సంగీతం ఎవరు ఇస్తున్నారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రానికి సంగీతం అందించిన అమిత్, ప్రభాస్ సినిమా చేయడం లేదని తెలియడంతో ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
మరి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు బాణీలు ఎవరు ఇస్తారా అనేది చూడాలి.