బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేను రాజమండ్రిలో పర్యటించనున్నారు.ఈ పర్యాటనలో ఈపీలో బీజేపీ రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే చంద్రబాబు విషయంలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి అమిత్ షా పార్టీ కార్యకర్తలతో చర్చించే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.
అలాగే త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ వేదికగా బహిరంగ సభకి బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది.అందులో చంద్రబాబు ఇన్నిరోజులు తమపై చేసిన విమర్శలన్నింటికి ప్రజలకి సమాధానం చెప్పలన్ని లక్ష్యంతో బీజేపీ శ్రేణులు వున్నట్లు కనిపిస్తుంది.
దీనికి ముందుగా అమిత్ షా రాజమండ్రి వేదికగా ఏపీ ప్రజలకి చంద్రబాబు విమర్శలపై సమాధానం చెప్పే అవకాశం వుందని తెలుస్తుంది.
రీసెంట్ గా గుంటూరు వేదికంగా ప్రధాని మోడీ బహిరంగ సభ విజయవంతం అయిన అందులో చంద్రబాబు, బీజేపీని లక్ష్యంగా చేసుకొని ప్రత్యెక హోదా, విభజన హామీల విషయంపై చేస్తున్న విమర్శలకి సమాధానం చెప్పకుండా కేవలం బాబుపై ప్రధాని తనదైన రాజకీయ విమర్శలతో సరిపెట్టారు.
ఆ కారణంగా ప్రధాని వచ్చిన కూడా బీజేపీ పార్టీ పట్ల ఏపీ ప్రజలలో సానుకూలత ఏర్పడలేదు.దీంతో ఏపీ ప్రజలకి బీజేపీ ఎం చేసింది.అలాగే చంద్రబాబుకి సహకరించకపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలపై ప్రధాని మాట్లాడితే ప్రజలకి స్పష్టంగా తెలియజేసినట్లు ఉంటుందని భావిస్తున్న బీజేపీ శ్రేణులు ఆ విషయాలని అమిత్ షాతో రాజమండ్రిలో చర్చించే అవకాశం వుందని తెలుస్తుంది.ఏది ఏమైనా ఈ రోజు అమిత్ షా రాజమండ్రి పర్యటన ఏపీ రాజకీయాలలో కొంత ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి.