కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.అనారోగ్య సమస్యతో శనివారం అర్ధరాత్రి ఎయిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.
ఆ మేరకు వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు.కాగా, గతంలో కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స పొంది నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు.
హోం క్వారంటైన్ లో ఉండగా అనారోగ్య సమస్య తలెత్తిందని కుటుంబసభ్యులు తెలుపుతున్నారు.
శనివారం అర్ధరాత్రి శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఎయిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది.కాగా, అమిత్ షా పరిస్థితి నిలకడగా ఉండని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.గత నెల 2వ తేదీన కరోనా బారిన పడిన అమిత్ షా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.14వ తేదీ వరకు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స చేయించుకున్నారు.అనంతరం నిర్వహించిన టెస్ట్స్ రిపోర్టుల్లో నెగిటివ్ రావడంతో ఆయన డిశ్చార్జ్ అయి ఇంట్లోలో హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.ఈ క్రమంలో శ్వాసకోశ సమస్య, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 18న ఎయిమ్స్ లో చేరి ఆగస్టు 31న డిశ్చార్జ్ అయ్యారు.
మళ్లీ సమస్య తలెత్తడంతో శనివారం తిరిగి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.