దేశవ్యాప్తంగా గత కొన్ని నెలల నుండి రైతులు నిరసనలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఈ తరహాలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లఖింపూర్ ఈ ప్రాంతంలో రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు చేపడుతున్నారు.ఈ క్రమంలో రైతుల నిరసనలు చేపడుతున్న స్థలం దగ్గరగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వెళుతుండటంతో వాటిలో.
ఒక బండి అదికూడా కేంద్ర మంత్రి యొక్క తనయుడు బండి రైతుల పైకి వెళ్లడంతో. దాదాపు ఎనిమిది మంది రైతులు మరణించడం జరిగింది.
దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన ఇప్పుడు పెద్ద రాజకీయంగా మారిపోయింది.వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘటనపై ఆరా తీస్తూ ఉన్నారు.కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు.ఈ ఘాతుకానికి పాల్పడినట్లు.ఆరోపణలు వస్తూ ఉండటంతో .ఇటీవల అజయ్ మిశ్రా అమిత్ షాతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలో రైతు సంఘాలు కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా ని అరెస్టు చేయాలని.డిమాండ్ చేస్తూ ఉండటం తో యూపీ పోలీసులు ఒక వీడియో ఆధారంగా అరెస్ట్ కుదరదు అని అంటున్నారు.ఇటువంటి తరుణంలో గొడవ మరీ పెద్దది అవుతున్న నేపథ్యంలో అమిత్ షా ఆశిష్ మిశ్రా… పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.