బిజెపి నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో ఈనెల 17వ తారీఖున పర్యటించడానికి రెడీ అవుతున్నారు.ఆ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులతో భేటీ కాబోతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్ర కి బ్రేక్ ఇవ్వనున్నారు.ఇప్పటికే బండి సంజయ్ వంద కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది.
ఈనెల 17వ తారీఖున పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి నిర్మల్ లో జరగబోయే తెలంగాణ విమోచన సభకు.హాజరుకానున్నారు.భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు ఆలోచన చేస్తున్నారు.ఇదే సమయంలో అమిత్ షా కి తన పాదయాత్ర కి సంబంధించి విశేషాలను.
అదేరీతిలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాలను అమిత్ షా దృష్టికి.బండి సంజయ్ తీసుకెళ్లనునట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ఇప్పటికే కార్యాచరణ తో రెడీ అవుతూ.దూసుకెళ్తున్న నేపథ్యంలో.
అమిత్ షా రాక పార్టీకి మరింత బలం చేకూరుతుందని క్యాడర్ భావిస్తోంది.