సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు అనుగుణంగా వారు ఉపయోగించే వస్తువులు కూడా అలాగే ఉంటాయి.చిన్నప్పటి నుంచి ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన హీరో హీరోయిన్లు లేదా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వారు వారి స్టేటస్ కి అనుగుణంగా వారి వస్త్రధారణ వారి కార్ల విషయంలో కూడా ఎంతో రిచ్ గా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమీషా పటేల్ తన కెరియర్ మొదట్లో ఎంతో దారుణమైన అవమానాలను ఎదుర్కొన్నానని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిసారి హృతిక్ రోషన్ సరసన ‘కహోనా ప్యార్ హై’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా తర్వాత అమీషా పటేల్ పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
‘కహోనా ప్యార్ హై’ సినిమాషూటింగ్ జరుగుతున్న సమయంలో మొదటి రోజు షూటింగ్ లోకేషన్ కు తాను బెంజ్ కార్ లో వచ్చానని తెలిపారు.అయితే హీరో హృతిక్ రోషన్ మాత్రం మారుతి కారులో సెట్ కి వచ్చారు.ఇలా నేను బెంజ్ కార్ లో రావడంతో లొకేషన్ లో అందరు నన్ను అహంకారిగా చూశారని నా పై సెటైర్లు వేయడం మొదలు పెట్టారని తెలిపారు.
నేను చిన్నప్పటినుంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల అదే విధంగానే సెట్ కు రావడం వల్ల మీడియా మాత్రం నాకు అహంకారి అనే ముద్ర వేసిందని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక ప్రస్తుతం అమీషా పటేల్ సన్నీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్న గదర్ సినిమా సీక్వెల్ చిత్రంలో నటిస్తున్నారు.