శ్వేతజాతి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అమెరికాకు చెందిన హై ప్రోఫైల్ వ్యక్తికి నార్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే.
అమెరికాలోని వైట్ నేషనలిస్ట్ కౌంటర్-కరెంట్ పబ్లిషింగ్ గ్రూప్కు ఎడిటర్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తున్న గ్రెగ్ జాన్సన్ నార్వే రాజధాని ఓస్లోలో ఓ సదస్సులో పాల్గొనడానికి వచ్చారు.అక్కడ యాంటీ సెమిటిక్, జాత్యాహంకార దాడులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న స్కాండ్జా ఫోరం సదస్సులో ఆయన ప్రసంగించాల్సి వుంది.
అయితే జాన్సన్ గతంలో ఉగ్రవాది అండర్స్ బ్రీవిక్కు మద్ధతుగా నిలవడంతో పాటు ద్వేషపూరిత ప్రసంగాన్ని దృష్టిలో ఉంచుకుని నార్వే ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆయనను అరెస్ట్ చేసింది.నార్వే ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం జాన్సన్ను అరెస్ట్ చేశామని.
అలాగే వీలైనంత త్వరగా అతనిని దేశం నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.రైట్ వింగ్ గ్రూప్ ఉగ్రవాది అయిన బ్రీవిక్కు ఓస్లోలో జరిగిన బాంబు దాడితో పాటు 2011 జూలైలో ఉటోయూ ద్వీపంలోని యూత్ క్యాంప్పై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 77 మందిని బలిగొన్నాడు.
జాన్సన్ అరెస్ట్ను కౌంటర్-కరెంట్ పబ్లిషింగ్ వెబ్సైట్ ధ్రువీకరించింది.ఇదే సమయంలో జాన్సన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు… బ్రీవిక్ చేసిన నేరాలకు తాను ఎప్పుడూ మద్ధతు ఇవ్వలేదన్నారు.కాగా ప్రపంచవ్యాప్తంగా మితవాద ఉగ్రవాదం పెరుగుతున్నట్లు నార్వే ఇంటెలిజెన్స్ సర్వీస్ హెచ్చరించింది.అలాగే సమీప భవిష్యత్తులో ఉగ్రవాదులు తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.