భారత ప్రభుత్వం తీసుకున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.ఈ క్రమంలోనే జామియా, అలీగడ్ ముస్లిం వర్సిటీల విద్యార్ధులు నిరసనలు తెలుపుతున్న క్రమంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
అయితే అక్కడి విద్యార్ధులపై చర్యలు తీసుకున్న నేపధ్యంలో కొన్ని దేశాలలో ఉన్న వర్సిటీలలో ఉంటున్న భారతీయ విద్యార్ధులు నిరసనలు తెలుపుతున్నారు.
అమెరికాలోని వివిధ వర్సిటీలకి చెందిన సుమారు 400 మంది భారతీయ విద్యార్ధులు ముస్లిం యూనివర్సిటీ లో విద్యార్ధులపై జరిగిన దాడిని ఖండించారు.
ఈ మేరకు రోడ్ల పైకి వచ్చి వారి నిరసన తెలిపారు.అంతేకాదు స్థానికంగా ఉన్న భారత ప్రభుత్వ కార్యాలయాలకి వారు రాసిన లేఖల్ని పంపారు.అంతేకాదు లండన్ లోని హార్వర్డ్ వర్సిటీలో ఉన్న విద్యార్ధులు సైతం తమ నిరసన గళాన్ని వినిపించారు.
హార్వర్డ్ విద్యార్ధులు తమ విశ్వవిద్యాలయం నుంచీ ఇండియా గేట్ వరకూ ర్యాలీగా వెళ్తూ నిరసనలు తెలిపారు.తమ తోటి విద్యార్ధులపై అక్కడ దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం ఎంతో భాదిస్తోందని తెలిపారు.అలాగే ఫిన్ ల్యాండ్ లోని భారతీయ విద్యార్ధులు మౌన ప్రదర్సన చేస్తూ తమ నిరసనలు వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి లేఖలు పంపారు.