ఎక్కడికైనా మనం వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఏమి చేస్తాం, ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకూ వెయిట్ చేస్తాం.ఇంకొంచం సేపు ట్రాఫిక్ కదలకుంటే అసలు ఎందుకు ఈ ట్రాఫిక్ జామ్ అయ్యిందో అంటూ ఆలోచన చేస్తాం.
ఇక చేసేది లేక ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకూ ఊసురోమని కూర్చుంటాం.కానీ అమెరికాలో ఓ ముగ్గురు యువకులు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు…దాంతో అది కాస్తా వైరల్ అయ్యి నేట్టింట్లో హల్చల్ చేస్తోంది.
మరి ఆ యువకులు ఏమి చేశారో మీరు ఓ లుక్కేయండి.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ముగ్గురు యువకులు రోడ్డు నడిమధ్యలో అది కూడా భారీగా ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో బల్ల , స్టూల్స్ వేసుకుని పేకాట ఆడుతున్న వీడియో హల్చల్ చేసింది.అదేంటి వీళ్ళకి ఏమి పోయేకాలం అంటూ అందరూ తిట్టుకున్నారు.కానీ వాళ్ళు చేసిన పని తెలుసుకుని మళ్ళీ అందరూ మెచ్చుకున్నారు.
రోడ్డు మధ్యలో గేమ్స్ ఆడుతుంటే మేచ్చేకోవడం ఏంటి
ఆ యువకులు ముగ్గురు రోడ్డు మధ్యలో కార్డ్ ఆడటానికి కారణం ఏమిటంటే.ఫ్లోరిడా లో ఏ సిగ్నల్ దగ్గర ఆడినా నిమిషాల పాటు వాహనాలు కదలడం లేదట.
రెడ్ సిగ్నల్ పడితే మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడటానికి చాలా సమయం పడుతోందని ఈ పరిస్థితితో అసలు ప్రయాణం చేయాలంటే చికాకు తెప్పిస్తోందని అంటున్నారు.అంతేకాదు అత్యవసర పరిస్థితి అయిన ఇక వారి పని అంతే అంటున్నారు ఆ యువకులు.
అందుకే ప్రభుత్వంలో మార్పు రావాలని తాము ఇలా సిగ్నల్ పడగానే రోడ్డుపై కార్డ్స్ ఆడుతున్నామని అంటున్నారు.
ఈ విషయంపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, ప్రయాణికుల బాధని తెలిపేలా వారు చేసిన పని అర్థమయ్యిందని త్వరలో ఈ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.