అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధన ఇప్పుడు చాలా మందికి గుబులు పుట్టిస్తోంది.బోస్టన్లోని ‘ఫ్రైడ్మ్యాన్ స్కూల్ ఆఫ్ న్యూట్రీషన్ సైన్స్ అండ్ పాలసీ'(టఫ్ట్స్ వర్సిటీ) జంక్ ఫుడ్స్ తనడం వలన ఎలాంటి ప్రభావం ఉంటోంది.
సమయానికి ఆహారం తీసుకో పొతే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనేటువంటి విషయాలపై పరిశోధన చేపట్టింది.ఈ పరిశోధనలో జంక్ ఫుడ్స్ తినడం వలన భవిష్యత్తులో మాత్రం క్యాన్సర్ రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
పూర్వం నుంచీ సాంప్రదాయంగా వస్తున్న ఆహారపు పద్దతిని పక్కకి పెట్టి మరీ ప్రతీ రోజు జంక్ ఫుడ్ తీసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80వేల మంది క్యాన్సర్ బారిన పడ్డారని అధ్యయనం తేల్చింది.కూరగాయలతో కూడిన సాంప్రదాయ ఆహారం, పండ్లు కాకుండా ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెరతో కూడిన జంక్ఫుడ్ను తీసుకోవడం అత్యంత ప్రమాదకరమైన విషయమని పరిశోధకులు వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ కేసుల్ని అధ్యయనం చేయగా అందులో మధ్య పాణం, కారణంగా దాదాపు 4-6శాతం కేసులు బయటపడ్డాయని తెలిపారు.అదేవిధంగా ,జంక్ ఫుడ్ కారణంగా సుమారు 5 శాతం మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని హెచ్చరించారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే క్యాన్సర్ బారిన పడే కేసులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.