కరోనా మహమ్మారి అమెరికాపై తీవ్ర స్థాయిలో తన ప్రభావాని చూపుతోంది.మృతి చెందిన వారితో అమెరికా వీధులు నిండిపోతున్నాయి.
చనిపోయిన వారిని పూడ్చడానికి స్మశానాలలో కాస్త చోటు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఈ పరిస్థతి మరీ దారుణంగా ఉంది.
అమెరికా ప్రజలహ్తో పాటు చనిపోతున్న వారిలో వలస వాసులు సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది.నిన్న ఒక్క రోజునే సుమారు 40 మంది ఎన్నారైలు మృతి చెందారు.
ఇదిలాఉంటే
అమెరికాలో న్యూయార్క్ తరువాత ఈ వైరస్ అత్యధికంగా ప్రభలిన సిటీ న్యూజెర్సీ. మృతుల సంఖ్య కూడా అత్యదికంగానే నమోదయ్యింది.
ఈ క్రమంలోనే న్యూజెర్సీ కి చెందిన సన్నోవా అనలెటికల్ సంస్థ సిఈవో మారేపల్లి.హనుమంత రావు చనిపోయారు.
ఏపీ కి చెందిన ఈయన అమెరికా వచ్చిన ఎన్నో ఏళ్ళ క్రితమే స్థిరపడ్డారని సన్నోవా అనలెటికల్ సంస్థ స్థాపించి అమెరికాలో ఉన్న ఏంతో మంది భారతీయులకి అక్కడ ఉపాది అవకాశాలు కల్పించారని ఎంతో మంచి వ్యక్తని అంటున్నారు ఉద్యోగులు.ఇదిలాఉంటే
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యులు హనుమంత రావు కడచూపు కోసం వెళ్ళారు.ఆయన గుండె పోటుతో మరణించారని తెలిపిన తానా.ఆయన అంత్య క్రియలు భారతీయ సాంప్రదాయాల ప్రకారం చేయడానికి వీలు కాలేదని ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా చాలా అంత్య క్రియలు జరిగాయని తెలిపారు.
అంత్య క్రియలు పాల్గొనడానికి ప్రభుత్వం కేవలం 9 మందికి మాత్రమే అవకాశం ఇచ్చిందని మిగిలిన వారు ఆన్లైన్ లో అంతిమ వీడ్కోలు చూస్తూ నివాళులు అర్పించామని తెలిపారు.