డాక్టర్.రూపా మూర్తి ఎన్నికల సమయంలో ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగింది.అప్పట్లో ఆమె బాగా ప్రాచుర్యం పొందింది.ఎన్నికల సమయంలో ఆన్లైన్ లో మోడీ కి మద్దతుగా నిలిచి ఆమె మాంచి పేరు సంపాదించుకున్నారు.అంతేకాదు మొట్టమొదటి గ్లోబల్ ఎన్నారై సమ్మిట్లోనూ ఆమె స్పీకర్గా వ్యవహరించారు.దాంతో ఆమెకి ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఒక్క సారిగా ఆమె ఫోటోలని అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రావడం చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఎన్నికల్లో మోడీ కి మద్దతుగా ప్రచారం చేసినందుకే తనని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని ఆమె ఇండియన్ ఎంబసీకి వెంటనే ఫిర్యాదు చేశారు.అంతేకాదు ఉత్తర్ప్రదేశ్ పోలీసులకు కూడా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు అందించింది.కానీ
ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కేసు విషయంలో ఎలాంటి స్పందన ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఉత్తర్ప్రదేశ్కు చెందిన దుర్గేశ్ కుమార్, శుక్లా, దీపక్ ,చంద్రవంశీ, రాజేష్ మౌర్య, మరికొందరు వ్యక్తుల నుంచీ సోషల్ మీడియాలో తనకి వేధింపులు వస్తున్నాయని ఆమె తెలిపారు.
ఈ విషయంపై పోలీసులు ఇప్పటి వరకూ స్పందిచక పోవడంతో ఆమె తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.ఒక ఎన్నారై మహిళగా ఫిర్యాదు చేస్తే కనీసం స్పందించలేదని ఆమె ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.