అదృష్టం అందరిని వరించదు, ఏళ్ళ తరబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు.కొందరైతే తమ అదృష్టాన్ని పరీక్షించుకుని విసుగు చెంది ప్రయత్నాలను విరమించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి.
కానీ కొందరికి మాత్రం మొదటి ప్రయత్నంలోనే అదృష్టం వరిస్తుంది.వద్దన్నా సరే దరిద్రం పట్టినట్టుగా అదృష్ట దేవత తలుపు తీసే వరకూ కొడుతూనే ఉంటుంది.
అలాంటి వారు ఎంత అదృష్టవంతులో కదా…ఇప్పుడు అలాంటి అదృష్టవంతుడి గురించే మనం చెప్పుకోబోతున్నాము.వివరాలలోకి వెళ్తే.
అమెరికాకు చెందిన జోస్ ఫ్లోర్స్ వర్జీనియా రాష్ట్రంలో ఉంటున్నాడు.ఓ రోజు సరదాగా షాపుకు వెళ్లి ఓ డ్రింక్ బాటిల్ కొన్న అతడు అక్కడ లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుండటం చూసి మనం కూడా కొంటె పోయేది ఏముందిలే అన్నట్టుగా ఓ లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.
అయితే కొన్ని రోజులకు తాను లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాను అనే విషయాన్ని కూడా అతడు మర్చిపోయాడు.అలా మూడు నెలలు పైనే గడిచిపోయింది.
ఈ లోగా ఓ రోజు నిర్వాహకుల నుంచీ ఫోన్ వచ్చింది.మీరు లాటరీ లో బహుమతి గెలుచుకున్నారని అయితే తన స్నేహితులు తనను ఆట పట్టిస్తున్నారని భావించి అతడు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు…ఈ క్రమంలోనే
లాటరీ నిర్వాహకులు మరో సారి జోస్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో నిజమా కాదా అన్నట్టుగా నిర్వాహకులను వెళ్లి కలిసాడు.
దాంతో ఇది నిజమేనని భావించి షాక్ అయ్యాడు జోన్స్.తనకి రూ.50 వేలు వచ్చి ఉంటుందనుకుని చెక్కు కోసం వేచి చూస్తున్న అతడికి అతి పెద్ద షాక్ తగిలింది.నిర్వహాకులు ఇచ్చిన చెక్కుపై ఏకంగా రూ.7 కోట్లు ఉండటం చూసి ఆశ్చర్య పోయాడు.ఇది నిజమేనా అంటూ ఉబ్బితబ్బిబ్బైపోయాడు.
ఈ డబ్బుతో మంచి పనులు చేస్తానని, బిజినెస్ మొదలు పెడుతానని తెలిపాడు జోస్.తాను కేవలం ఓ డ్రింక్ బాటిల్ కొనడానికి వెళ్లి సరదాగా లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశానని కానీ ఊహించని విధంగా ఇలా అదృష్టం తనని వరిస్తుందని అనుకోలేదని చెప్పుకొచ్చాడు.
.