అగ్ర రాజ్యం అమెరికాలో చాకో క్యాస్త్రో అనే ఓ మహిళ, దొంగగా మారి ఏకంగా దొంగల ముఠాను ఏర్పాటు చేసుకుంది.సుమారు నాలుగేళ్ల పాటు హల్చల్ చేసింది.కేవలం భారతీయుల ఇళ్ళు టార్గెట్ గా చేసుకున్న ఆమె ఎన్నో చోరీలకి పాల్పడింది.2011 – 2014 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా భారీగా చోరీలు చేసి దొంగల రికార్డులు అన్నీ బద్దలు కొట్టేసిందట.ముఖ్యంగా జార్జియా, న్యూయార్క్ ఒహైయో, మిషిగాన్, టెక్సాస్ తదితర ప్రాంతాల్లో ఈమె చోరీలకి పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు.
క్యాస్ట్రో దొంగతనాలలో ఉన్న కొత్తదనం ఏమిటంటే.దొంగతం ఎక్కడ చేయాలో ముందుగానే నిర్ధారించుకున్న తరువాత, ఆ ఇంటి నుంచీ ఎటువంటి వస్తువులు దొంగిలిచాలో ముందుగానే లిస్టు రెడీ చేసి, ఆ లిస్టు తన శిష్యులకి ఇస్తుందట.అంతేకాదు ముందుగానే ఆ పరిసర ప్రాంతాలలో వారం రోజుల పాటు రెక్కి నిర్వహించి ఆ తరువాత తన బ్యాచ్ కి దిశానిర్దేశం చేస్తుందట.
టార్గెట్ ఫిక్స్ అయిన తరువాత తనవాళ్ళని ముసుగులు, ఆయుధాలతో పంపిస్తుందని విచారణలో తేలింది.అంతేకాదు.ఇంట్లోకి వెళ్ళిన తరువాత చిన్న పెద్దా తేడా లేకుండా అందరిని బెదిరిస్తూ తమ టార్గెట్ కంప్లీట్ చేస్తుందని పోలీసులు తెలిపారు.అయితే ఎప్పటి నుంచో క్యాస్ట్రో పై దృష్టి పెట్టిన పోలీసులకి ఎట్టకేలకి చిక్కిన ఆమెపై మిషిగాన్ న్యాయస్థానం దోషిగా తేల్చి తీర్పు ఇచ్చింది.
ఆమెతో సహా అందరికి భారీగానే శిక్షలు పడే అవకాశం ఉందని అంటున్నారు పోలీసు అధికారులు.