అమెరికా దంపతులు ఎంతో ఔదార్యాన్ని చాటారు.జన్మనిచ్చిన తల్లి , తన శిశువుని రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ బిడ్డని అమెరికెన్ దంపతులు దత్తత తీసుకుని తమ మానవత్వాన్ని చాటారు.
ఈ సంఘటన తూగో జిల్లాలో జరిగింది.అక్కడ కలెక్టర్ సమక్షంలో ఈ దత్తత కార్యక్రమం జరిగింది.
వివరాలలోకి వెళ్తే.
తూగో జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో , జూన్ 12 ¸2017వ తేదిన ఒక మహిళ తనకి జన్మనిచ్చిన బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపోయింది.ఆ బిడ్డని ఆసుపత్రి వర్గాలు ఆ శిశువును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలోని శిశు గృహం సంరక్షణలో ఉంచడం జరిగింది ఆ బిడ్డ తల్లి వస్తుందని కొన్నాళ్ళు వేచి చూసిన అధికారులు ఆ తరువాత .ఆ బిడ్డని దత్తత ఇస్తామంటూ అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు.అయితే
ఈ ప్రకటన చూసిన అమెరికా గ్రాండ్ దీనిని చూసిన అమెరికా గ్రాండ్ ఫోర్క్స్, ఏఎఫ్బీ నార్త్ డకోటాకు చెందిన జాషువా ఎబోల్జ్, ఎమిఎబోల్జ్ దంపతులు బాలికను దత్తత తీసుకోవడానికి దరఖాస్తు దాఖలు చేశారు.అయితే అమెరికా వాసులు కావడం తో ఈ వివరాలు పరిశీలించిన అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకుని వెళ్ళారు.దాంతో న్యాయస్థానం సైతం అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తూ గో కలెక్టర్ కార్తికేయ విశ్రా సమక్షంలో ఆ దంపతులకి పాపని అందచేశారు.
తాజా వార్తలు