భారత్ పై ఆరోపణలు చేసిన వాల్ మార్ట్

ఎక్కడో అమెరికా లో ఉన్న మల్టీనేషనల్ రిటెయిల్ కార్పొరేషన్ వాల్ మార్ట్ ఇండియా పై ఆరోపణలు చేసింది.ఈ-కామర్స్ కు సంబంధించి భారత నూతన పెట్టుబడి నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, తమ వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయంటూ అగ్రరాజ్యం అమెరికాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

 American Company Walmart Comment On Indian Government To America-TeluguStop.com

ఇప్పటికే భారత్-అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ ఓ వైపు సాగుతుండగా దానికి ఆజ్యం పోస్తూ వాల్ మార్ట్ ఈ సరికొత్త ఆరోపణలు చేసింది.అయితే వాస్తవానికి గత జనవరిలోనే ఫిర్యాదు చేసినప్పటికీ తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటును రాయిటర్స్ కు అందజేయడం తో ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సరికొత్త టారిఫ్ నిబంధనలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే 28 వస్తువుల పై సుంకాలను పెంచుతూ సరికొత్త నిబంధనలు రూపొందించడం తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భారత్ పై నిప్పులు గక్కారు.

అయితే ఈ విధంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకాలను పెంచడం తమను ఆందోళనకు గురి చేస్తోందని, ఈ-కామర్స్ రెగ్యులేషన్స్ అత్యంత హార్ష్ గా ఉన్నాయంటూ వాల్ మార్ట్ పేర్కొంది.రిటెయిల్ మార్కెట్లో వాల్ మార్ట్.

ఇండియాతో మంచి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది.అయితే అమెరికన్ సరుకులపై భారత ప్రభుత్వం సుంకాలను పెంచడంతో దాని ప్రభావం ఈ సంస్థపై కూడా పడడం తో పై విధంగా అమెరికా కు ఫిర్యాదు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube