అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ భాద్యతలు చేపట్టిన తరువాత వలస వాసులని నియంత్రించడమే పనిగా పెట్టుకున్నారు.అందుకోసం ఓ యంత్రాంగాన్ని భారీగా సిద్దం చేసిన ట్రంప్ వలస దారులు సరిహద్దుల్లో ఎక్కడ కనపడినా సరే వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలని జారీ చేశారు.
అత్యంత క్రూరంగా వారిపై చర్యలకి తెగపడిన ట్రంప్ చివరికి వలస వాసుల బిడ్డలని తల్లి తండ్రుల నుంచీ వేరు చేయడం మొదలు పెట్టారు.ఈ క్రమంలో ఎంతో మంది తమ పిల్లలని దూరం చేసుకున్నారు కూడా.అయితే
వలస వాసులపై ట్రంప్ సర్కార్ అవలంభిస్తున్న తీరు పట్ల అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ తప్పు బట్టింది.గడిచిన సంవత్సర కాలంలో దాదాపు 900 మందిని నిర్భంద కేంద్రాలకి తరలించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.పిల్లలని నిర్భంధించి వారి హక్కులని కాలరాస్తున్న ట్రంప్ పై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని లిబర్టీస్ యూనియన్ కోరింది.
తల్లి తండ్రుల నుంచీ చిన్నారులని వేరు చేయడం తగదంటూ కాలిఫోర్నియా కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది.
దాంతో ఈ కేసు విచారణ చేపట్టడానికి అంగీకరించిన న్యాయస్థానం.ఈ పిటిషన్ కి ప్రతిగా కౌంటర్ దాకలు చేయాలని ట్రంప్ ప్రభుత్వానికి గడువు ఇచ్చింది.
.